logo

సిపిఐలో చేరిన కొత్తగూడెం మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్ నారాయణ, కూనంనేని సమక్షంలో 50 కుటుంబాలు సిపిఐలో చేరిక

కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ సాహెరాబేగం దంపతులతోపాటు కొత్తగూడెం పట్టణానికి పట్టణానికి చెందిన నేరెళ్ల రమేష్, మాదాసు మాధవ్, పద్మప్రియ, పైడిపల్లి లక్ష్మి, పాల్వంచకు చెందిన ఎస్ కె గౌస్, ఎస్ ఏ రహమాన్, మహమ్మద్ అహ్మద్ జానీ, ఎస్ కె కరీం, మహమ్మద్ యాకూబ్, ఇట్టి వెంకట్ రావు తదితరులు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సమక్షంలో గురువారం సీపీఐలో చేరారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్స్లో జరిగిన ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మండలాలు, పట్టణాల సిపిఐ సమితి సభ్యుల సమావేశం సందర్బంగా వారి సిపిఐలో చేరారు. వీరికి నారాయణ, కూనంనేని పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన స్థానిక ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాల భాద్యతలు స్వీకరించి ప్రజా సమస్యల పరిస్కారంకోసం పనిచేయాలని, తద్వారా పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తరించాలని సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు, రాష్ట్రంలో సిపిఐకి జనాదరణ పెరుగుతోందని ప్రజలకోసం పనిచేసే పార్టీలను ప్రజలు ఎన్నటికీ ఆదరిస్తారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, భద్రాద్రి, ఖమ్మం జిల్లా కార్యదర్శులు ఎస్ కె సాబీర్ పాషా, పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, చంద్రగిరి శ్రీనివాసరావు, దుర్గరాసి వెంకన్న, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

9
1340 views